PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా సమాధుల పండుగ

1 min read

పల్లెవెలుగు, వెబ్ మిడుతూరు: మండలంలోని వివిధ గ్రామాలలో సమాధుల పండుగను(సకల మృతుల స్మరణ)క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని కడుమూరు,49బన్నూరు,చౌటుకూరు దేవనూరు, ఉప్పలదడియ, దేవనూరు తదితర గ్రామాలలో ఆర్ సీఎం విచారణ గురువులు శ్యాం కుమార్ మరియు గుంటూరు జిల్లా ఉప్పమాగులూరు విచారణ గురువులు మధుబాబు ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సంఘస్తులు సమాధుల దగ్గర క్రొవ్వోత్తులు వెలిగిస్తూ పూలు వేస్తూ మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు.తర్వాత చర్చిలలో వారి కొరకు దివ్య బలిపూజను విచారణ గురువులు సమర్పించారు.తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారిని గౌరవించడం సంప్రదాయమని వారి రుణం తీర్చుకోలేనిదని విచారణ గురువులు వాక్య పరిచర్య చేశారు.

About Author