PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గౌరు సమక్షంలో టిడిపిలో చేరిన విద్యార్థి నాయకుడు.. శ్రీరాములు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఒర్వకల్ : వైసీపీలో బై రెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరుడుగా పేరు మోసిన రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ చైర్మన్ శ్రీరాములు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బుధవారం నాడు నందికొట్కూర్ టిడిపి పార్లమెంట్ ఇన్చార్జి గౌరు వెంకట్ రెడ్డి సమక్షంలో విజయవాడలో టిడిపి సెంట్రల్ ఆఫీస్ లో  అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కండువా కప్పి టిడిపి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ పోరాటమే స్ఫూర్తిగా స్థానికంగా సమస్యలను అధికారులు నాయకుల దృష్టికి తీసుకు వెళ్తూ రాయలసీమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంగా విద్యార్థి యువజన సంఘాలతో నిరంతరం పోరాటం చేశామని అయితే టిడిపి విధానాలు నచ్చి టిడిపి పార్టీలో చేరినట్టు పార్టీ అభివృద్ధికి వచ్చే ఎన్నికలలో పాణ్యం లో గౌరు చరితమ్మ విజయానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి,ఓర్వకల్లు మండలం నాయకులు పాలకొలను సుధాకర్ రెడ్డి,పాల్గొన్నారు.

About Author