NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టైక్వాండో క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూల్ పాత బస్తి బండి మెట్టలోని నారాయణ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మధుసూదన్ రెడ్డి టైక్వాండో పోటీల్లో తన ప్రతిభను చాటి బ్లాక్ బెల్ట్ 1 డాన్ కైవసం చేసుకున్నాడు. నారాయణ విద్యాసంస్థల ఏ.జీ.ఎం రమేష్ కుమార్ బెల్టును కైవసం చేసుకున్న మధుసూదన్ రెడ్డిని అభినందించారు,వారు మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని క్రీడల్లో గెలుపు ఓటములు సహజమన్నారు సమాచార టీంలు హృదయాలను గెలుచుకున్నప్పుడే నిజమైన గెలుపు వారిస్తుందని సూచించారు, తల్లిదండ్రులకు మరియు శిక్షణ ఇచ్చిన టైక్వాండో మాస్టర్లకు ప్రత్యేక అభినందనీయలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్.కే. అజీజ్ , ఆర్.ఐ. దుర్గ లక్ష్మి పాల్గొన్నారు.

About Author