NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ్యోతి సూపర్ మార్కెట్ లో ఆకస్మిక తనిఖీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు కార్పొరేషన్​: నగరంలోని జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్న జ్యోతి సూపర్ మార్కెట్ లో కోవిడ్ నిబంధనలు అమలుపై కర్నూల్ నగర పాలక అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కస్టమర్లు.. బిల్ పేమెంట్ సెక్షన్ వద్ద గుంపులు గుంపులుగా ఉండకుండా అదనపు బిల్ పేమెంట్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని, సూపర్ మార్కెట్ లోకి అనుమతించే సమయంలో కచ్చితంగా థర్మల్ స్క్రీనింగ్ చేయడంతో పాటు శానిటైజర్ ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తనిఖీలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, హెల్త్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ నాగరాజు తదితరులు ఉన్నారు.

About Author