PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘోర అగ్నిప్ర‌మాదం.. ఐదుగురి స‌జీవ ద‌హ‌నం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏలూరు జిల్లా మసునూరు మండలంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘ‌ట‌న‌ అక్కిరెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. మరో 13 మందికి తీవ్రగాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో విధుల్లో 17 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

                                   

About Author