PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఘన స్వాగతం…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు/ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు హెలిప్యాడ్ నందు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నగర మేయర్ బివై.రామయ్య, ఎమ్మెల్సీ మధుసూదన్, రామచంద్ర రెడ్డి, ఎమ్మిగనూరు శాసనసభ్యులు చెన్నకేశవ రెడ్డి, ఆదోని శాసన సభ్యులు సాయిప్రసాద్ రెడ్డి, మంత్రాలయం శాసనసభ్యులు బాలనాగిరెడ్డి, పత్తికొండ శాసనసభ్యులు కంగాటి శ్రీదేవి, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, లింగాయత్ కార్పోరేషన్ ఛైర్మన్ రుద్రగౌడ్, కెడిసిసి బ్యాంకు ఛైర్మన్ విజయ మనోహరి, కుడా ఛైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి రామ్ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ బుట్ట రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్ రెడ్డి, మురళీధర్, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తదితరలు స్వాగతం పలికారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నందు జగనన్న చేదోడు నాలుగవ విడత పథకం ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక చేయూత అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని ఎమ్మిగనూరు హెలిప్యాడ్ నుంచి మ.3:47గం.లకు హెలికాప్టర్ లో బయలుదేరారు.ప్రజాప్రతినిధులతో విన్నపాలు స్వీకరించడంతో పాటు ప్రజల ద్వారా స్పందన అర్జీలను స్వీకరించారు.తిరుగు ప్రయాణంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, నగర మేయర్ బివై.రామయ్య, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, అధికారులు ఘన వీడ్కోలు పలికారు.

About Author