PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాకిస్థాన్ వెళ్లిన భార‌త మ‌హిళ‌కు ఘ‌న స్వాగతం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మూడు నెలల విజిటింగ్ వీసాపై పాకిస్థాన్‌లోని రావల్పిండిలో అడుగుపెట్టిన రీనా వ‌ర్మ చిబ్బార్ కు అపూర్వ స్వాగతం లభించింది. అంతటి ఘన స్వాగతాన్ని ఊహించని ఆమె సంతోషం పట్టలేకపోయింది. రావల్పిండిలోని డీవీఏ కాలేజీ రోడ్డులో ఉన్న పూర్వీకుల ఇంటికి వచ్చిన రీనా వర్మకు మేళతాళాలతో ఇరుగుపొరుగువారు స్వాగతం పలికారు. డ్యాన్సులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. 92 ఏళ్ల వయసులోనూ పూర్తి ఆరోగ్యంగా ఉన్న రీనా కూడా వారితో కలిసి కాలు కదిపారు. తన పూర్వీకుల ఇంటిలోని ప్రతి గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. బాల్కనీలో నిల్చుని పాట పాడారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా చిబ్బార్ మాట్లాడుతూ.. వేరే దేశానికి వచ్చిన భావన తనకు కలగలేదన్నారు. దేశ సరిహద్దులకు ఇరువైపుల ఉన్న ప్రజలు పరస్పర ప్రేమానురాగాలతో మెలుగుతున్నారని, అందులో తాను కూడా ఒకరినని అన్నారు.

                                     

About Author