NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“విస్తృత-స్థాయి” సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం:  గౌరు దంపతుల స్వగృహం మాధవి నగర్ నందు టీడీపీ జనసేన,బీజేపీ పార్టీ నాయకులు,కార్యకర్తలతో ఓర్వకల్లు మండల “విస్తృత-స్థాయి” సమావేశం నిర్వహించిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరిత రెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నందికొట్కూరు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ శ్రీ గౌరు వెంకట రెడ్డి  మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ , జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చింతా సురేష్  పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోవింద్ రెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రహ్మణ పల్లె నాగిరెడ్డి,మండల నాయకులు పాలకొలను సుధాకర్ రెడ్డి, లక్ష్మీ కాంత రెడ్డి, చింతలపల్లి సర్పంచ్ వేంకట రమణ,మండల మైనారిటీ నాయకుడు మహబూబ్ భాష, మండల ఎస్సి సెల్ నాయకులు ఎసోబు,రాయలసీమ విద్యార్థి విభాగం జేఏసీ అధ్యక్షులు శ్రీరాములు, నవ్యాంధ్ర జేఏసీ అధ్యక్షుడు అయ్య స్వామి,మరియు టీడీపీ,జనసేన ,బీజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author