PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లారీ కింద పడి మహిళ మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  మండల కేంద్రమైన గడివేములలో సినిమా ధియేటర్ సమీపాన జిందాల్ పరిశ్రమకు స్లాగ్ తీసుకో వెళుతున్న  లారీ కింద పడి మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మిడుతూరు మండలం చెరుకు చెర్ల గ్రామానికి చెందిన తంబలి కస్తూరయ్యా భార్య పద్మావతమ్మ, మనవరాలు త్రిపుర తో కలిసి టీవీఎస్ మోటార్ సైకిల్ పై కొడుకును చూడడానికి మహానందికి వెళుతుండగా గడివేముల సినిమా ధియేటర్ సమీపాన టీవీఎస్ మోటార్ సైకిల్ వెనుక వస్తున్న  లారీ అతివేగంగా వచ్చి టీవీఎస్ మోటార్ సైకిల్ ను డి కొట్టడంతో తంబలి కస్తూరయ్య భార్య పద్మావతమ్మ 58 సంవత్సరాలు అక్కడే మృతి చెందింది. తంబలి కస్తూరయ్యకు మనవరాలు త్రిపురకు స్వల్ప గాయాలయ్యాయి.  మృతురాలి భర్త తంబలి కస్తూరయ్యా ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసినట్లు ఏ ఎస్ ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

About Author