PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో అభినందన సభ

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల మైనారిటీ సెల్ జోనల్ కో ఆర్డినేటర్ గా అబూబక్కర్ ఎన్నికైన సందర్బంగా మంగళవారం పట్టణంలోని ముబారక్ ఫంక్షన్ హాలు నందు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, మైనారిటీ నాయకులు, అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో అబూబక్కర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, సహకారం అందించిన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పగిడ్యాల మాజీ జెడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి , మైనారిటీ నాయకులు మోమిన్ మన్సూర్, కౌన్సిలర్ లు, మైనారిటీ సంఘాలు, స్నేహితులు మరియు వార్డు ఇంచార్జ్ లు, వైసిపి నాయకులు తదీతరులు పాల్గొన్నారు.

About Author