PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆబికె కేంద్రాలు ఆధునిక దేవాలయాలు..

1 min read

– గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎలిజా
పల్లెవెలుగు వెబ్ చింతలపూడి : రేచర్ల గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు రానున్న కాలంలో రైతులఅభివృద్ధి కోసం ఆధునిక దేవాలయాలుగా మార నున్నయని చింతలపూడి శాసనసభ్యులు ఉన్న మట్ల ఎలిజ అన్నారు. చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో జరిగిన. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నూతన ఆర్ బి కె కేంద్రాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ జానకి రెడ్డి.ఎంపీపీ డాక్టర్ రాంబాబు ల తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి వైఎస్ఆర్ పార్టీ పెద్దపేట వేస్తోంద ని.రైతులు ఆర్ బి కె కేంద్రాలని వినియోగించు కొని. లబ్ధి పొందాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివరామకృష్ణ. పోతునూరు సొసైటీ అధ్యక్షులు శ్రీనివాసరావు. ఉర్లగుడెం సర్పంచ్ యువరాజ్. నిమ్మ గడ్డ దుర్గారావు. దిలీప్. కాంతారావు. ఇమ్మానుయేలు. ప్రకాష్ పాల్. మండల అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

About Author