PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేతవరంలో జగనన్న కాలనీ లేవుట్ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామంలో నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు జగనన్న కాలనీ లేవుట్ ను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేతవరం గ్రామంలో జగనన్న కాలనీ లేవుట్ లో విద్యుత్ సరఫరా, త్రాగునీటి సదుపాయమును జిల్లా కలెక్టర్ పరిశీలించి జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ లే అవుట్ లో ఎన్ని ఎకరాలు, ఎంతమంది ఇల్లు నిర్మించుకుంటున్నారు, ఇంకా ఎంతమంది ఇల్లు నిర్మించుకోవలసి ఉంది వంటి వివరాలను అడిగి తెలుసుకొని ఇంకా మొదలు పెట్టని ఇళ్లను వెంటనే మొదలు పెట్టేలా లబ్ధిదారులకు మోటివేషన్ చేయాలని హౌసింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గారి వెంట తహసీల్దార్, ఎంపీడీవో, హౌసింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author