NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగనన్న కాలనీలలో ఇండ్ల నిర్మాణం వేగం పెంచండి

1 min read

రాయచోటి మున్సిపల్ కమీషనర్ రాంబాబు
పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: జగనన్న కాలనీల లబ్ధిదారులకు మార్గదర్శకాలను వివరించి ఇళ్ల నిర్మాణాల వేగంపెంచాలని రాయచోటి మున్సిపల్ కమీషనర్ రాంబాబు పేర్కొన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయం లో హౌసింగ్,ఇంజనీరింగ్, మెప్మా& వార్డు ఇంజనీరింగ్ కార్యదర్శులతో ఇండ్ల నిర్మాణాలపై సమీక్ష ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాన్ని అందించాలన్నారు.
ప్రతి పేదవారికి సొంతింటి కల నిజం చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని, ప్రతి ఒక్కరు అందుకు అనుగుణంగా పని చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ DE శ్రీధర్ రెడ్డి,మున్సిపల్ DE సుధాకర్ నాయక్, AE లు కృష్ణారెడ్డి, బిక్షం, మల్లికార్జున,బాషా, హరి,రామయ్య, కళ్యాణ్ పాల్గొన్నారు.అనంతరం మున్సిపల్ కమీషనర్ గారు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రజారోగ్య విభాగం AE కావ్య తో చర్చించారు.
x

About Author