NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓపెన్ ఇంటర్ విద్యకు 27వరకు దరఖాస్తుల స్వీకరణ

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఇంటర్మీడియట్ చదువుతూ మధ్యలో నిలిపివేసిన విద్యార్థులు ఓపెన్ ఇంటర్ మీడియట్ కు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మిడుతూరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ నాయక్ తెలిపారు.ఇంటర్ చదువుతూ మధ్యలో ఆపివేసిన విద్యార్థులకు ప్రభుత్వం మంచి అవకాశాన్ని కల్పించిందని వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈనెల 27వ తేదీ లోపల apopenschool.ap.gov.ఇన్ వెబ్ సైట్ లో ఆన్లైన్ చేసి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కు ఇవ్వాలని అన్నారు.ఇంటర్ విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ విద్య ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ విద్యను పూర్తి చేసేందుకు గొప్ప అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని ఆయన అన్నారు.

About Author