PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్టీసీ బ‌స్సుకు యాక్సిడెంట్.. ప‌ది మందికి గాయాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నెల్లూరు జిల్లా బురాన్ పూర్ వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సుకు ప్ర‌మాదం జ‌రిగింది. గురువారం అర్ధ‌రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆర్టీసీ గ‌రుడ బ‌స్సు అదుపుత‌ప్పి కాల్వ వంతెన‌ను ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో 10 మంది ప్ర‌యాణీకుల‌కు గాయాల‌య్యాయి. ఒక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. బ‌స్సు చెన్నై నుంచి నెల్లూరు వైపు వ‌స్తుండ‌గా ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

                                  

About Author