NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకున్న‌ది ఎందుకో చెప్పిన అచ్చెన్నాయుడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : న్యాయవ్యవస్థపై ప్రభుత్వం దాడి చేసినా..రాష్ట్ర పెద్దగా ఏ ఒక్కరోజు గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడలేదని, అందుకే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశం తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌కు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని, కనీసం దీనిపై గవర్నర్ స్పందించలేదని, తాము హెచ్చరించినా గవర్నర్ పట్టించుకోలేదని విమర్శించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం పని చేస్తున్నా.. దానిపై కూడా గవర్నర్ ఏనాడూ సీఎంను పిలిచి మాట్లాడలేదని అచ్చెన్న వ్యాఖ్యానించారు.

                           

About Author