PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అద్భుత ఫలితాలు సాధించిన రవీంద్ర… శ్రీకృష్ణ జూనియర్ కళాశాలలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   నేడు ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఇంటర్ ఫలితాలలో రవీంద్ర మరియు శ్రీకృష్ణ జూనియర్ కళాశాలలు అద్భుత ఫలితాలు సాధించాయి. సీనియర్ MPC విభాగంలో బి .హిమచంద్ర 985 ,కె.రాహితి మేఘన 985, సాయి యశోద 984, BiPC విభాగంలో ఎస్. సుమయ హఫ్స 985 ,సనా సమ్రీన్ 982 మార్కులు సాధించారు. జూనియర్ MPC విభాగంలో కె. రాజేశ్వరి 463, బి.శివమనీషా 462 ,BiPC విభాగంలో అర్సియా సుల్తానా 431, బి. ఉషారాణి 431 మార్కులు  సాధించి కళాశాలల టాపర్లుగా నిలిచారు. ఈ అద్భుత ఫలితాలు సాధించడానికి కృషిచేసిన అధ్యాపక బృందాన్ని రవీంద్ర విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీ జి. పుల్లయ్య , చైర్మన్ జి. వి.యం. మోహన్ కుమార్  ,ప్రిన్సిపాల్ ప్రసాద్ రెడ్డి , కళాశాల సమన్వయకర్త సురేంద్ర రెడ్డి ల అభినందించారు .అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author