PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఖురాన్ ను కించపరిచిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో పవిత్ర గ్రంథమైన ఖురాన్ ను కించపరుస్తూ పలువురు వ్యక్తులు పలు కామెంట్లు చేసిన ఘటనపై కర్నూలు నగరంలోని ముస్లిం నేతలు రెండవ పట్టణ సీఐని కలిసి వినతిపత్రం సమర్పించి ఫిర్యాదు చేశారు. ఈ నెల 8వ తేదీన ఉమా గౌరి శెట్టి, వెంకట సుబ్బారావు అనే వ్యక్తులు ఖురాన్ ను అగౌరవపరిచేలా ఇష్టానుసారంగా కామెంట్లు చేసారని.. ఇది మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా ముస్లిం సోదరులు సిఐ గారికి విజ్ఞప్తి చేశారు. కులమతాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు రెచ్చగొట్టే విధంగా ఇలాంటి కామెంట్లు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సిఐ గారిని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నేతలు నౌషాద్ భాయ్, మన్సూర్ ఆలీఖాన్, మెహబూబ్, నాయీమ్, ఇబ్రహీం, అబ్బాస్, జహంగీర్ బాషా, ఇమ్రాన్, రజాక్, గౌస్, జుబేర్, యూనుస్, తదితరులు పాల్గొన్నారు.

About Author