PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్ణాటక మధ్యాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు : ఎస్​ఐ

1 min read

– అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: కర్ణాటక మద్యం సరఫరా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎప్పటికప్పుడు నిఘ వేసి, మద్యం సరఫరా చేసే వారిని పట్టుకుని జైలుకు తరలిస్తున్నట్లు ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం తన సిబ్బంది తో, తోవి గ్రామానికి చెందిన హుసేని మరియు పరుశురాములు అక్రమంగా కర్ణాటక మద్యంను కర్ణాటక రాష్ట్రం, సిరుగుప్ప తాలూకా పరిధిలో మురవాణి గ్రామం నుండి మోటార్ సైకిల్ పై తీసుకొని వస్తుండగా వారిని పట్టుకుని వారి వద్ద నుండి ఒక మోటార్ సైకిల్ మరియు 10 బాక్స్లు 960 టెట్రా ప్యాకెట్స్ కర్ణాటక మధ్యమును సీజ్ చేసి జైలుకు పంపడమైనది. అక్రమ కర్ణాటక మద్యం సరఫరా లో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్ ఐ హెచ్చరించారు.

About Author