NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చురుగ్గా క‌దులుతున్న రుతుప‌వ‌నాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కొద్దిరోజులుగా మందకొడిగా ఉన్న నైరుతి రుతుపవనాలు గత నాలుగు రోజులుగా చురుగ్గా మారాయి. శనివారం ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్‌, రాజస్థాన్‌లోని మిగిలిన ప్రాంతాలకు విస్తరించాయి. దీంతో దేశంలోని అన్ని ప్రాంతాలను రుతుపవనాలు తాకినట్టు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. జూలై 8 కల్లా దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించాల్సి ఉండగా, ఈ ఏడాది ఆరు రోజుల ముందుగానే విస్తరణ ముగిసింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు, కోస్తాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

                                                 

About Author