NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆదర్శమూర్తి శ్రీరామచంద్ర మూర్తి..

1 min read

– మల్యాల గ్రామంలో ఘనంగా సీతారాముల కళ్యాణం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కష్టాలెన్ని ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీరామచంద్రుడిని ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని మల్యాల గ్రామ సర్పంచి ఉమాదేవి అన్నారు .గురువారం మండలం లోని మల్యాల గ్రామం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అంత్యంత వైభవంగా నిర్వహించారు. . పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ సంధర్బంగా సర్పంచి ఉమాదేవి, ఆలయ ధర్మకర్త అనురాధ లు మాట్లాడుతూ సమస్యలు, సంక్షోభాలు ఎదురయినప్పుడు వాటికి భయపడి పారిపోకుండా ఎలా విజయాలు సాధించవచ్చో శ్రీరాముడు లోకానికి చాటి చెప్పారన్నారు.జగత్తుకు కళ్యాణ సంస్కృతిని నేర్పిన జంట సీతారాముల జంట అని అన్నారు.శ్రీరాముని దయవల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author