PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఉగాది నాటికి కొత్త జిల్లాలు ఏర్పడుతాయని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ అన్నారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే 26 జిల్లాల్లో రెండు జిల్లాలు ప్రత్యేకంగా గిరిజన ప్రాంత జిల్లాలుగా ఉంటాయని చెప్పారు. సమీకృత అభివృద్ధి కోసం పౌరసేవలు మరింత మెరుగ్గా అందించేందుకు కొత్త జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల అంశం కూడ ఆయన ప్రసంగంలో పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమం తమ ప్రభుత్వ ప్రాధాన్యతగా తెలిపారు. 11వ పీఆర్సీలో భాగంగా 23 శాతం పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.

                 

About Author