PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిసిల అభ్యున్న‌తి టిడిపితోనే సాధ్యం.. టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్‌

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బిసిల అభ్యున్న‌తి తెలుగుదేశం పార్టీతోనే సాద్య‌మ‌వుతుంద‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. శ‌నివారం న‌గ‌రంలోని మౌర్య ఇన్‌లో టిడిపి వీర‌శైవ సాధికార క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌నున్న బిసి భ‌రోసా బాట కార్య‌క్ర‌మానికి సంబంధించిన క‌ర‌ప‌త్రాల‌ను టి.జి భ‌ర‌త్ ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ పార్టీ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు వీర‌శైవ సాధికార క‌మిటీ నేత‌లు ముందుకు రావ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు. వ‌చ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే ప్ర‌జ‌ల‌కు భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్న ప్ర‌ధాన అంశాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌న్నారు. వీర‌శైవ క‌మిటీతో పాటు ఇత‌ర క‌మిటీలు కూడా ముందుకు వ‌చ్చి స్వ‌త‌హాగా కార్య‌క్ర‌మాలు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌న్నారు. అనంత‌రం రాష్ట్ర వీర‌శైవ సాధికార క‌మిటీ క‌న్వీన‌ర్ శివ‌రాజు మాట్లాడుతూ క‌ర్నూల్లో టి.జి భ‌రత్ గెలిస్తే న‌గ‌రం బాగుప‌డుతుంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు మంచి భ‌విష్య‌త్తు కావాలంటే టిడిపిని గెలిపించుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌గ‌ర అధ్య‌క్షుడు నాగ‌రాజు యాద‌వ్‌, నేత‌లు మ‌ల్లికార్జున‌ప్ప‌, గంగాధ‌ర శాస్త్రి, చంద్ర‌శేఖ‌ర‌ప్ప, న‌వీన్‌, దామోద‌ర్‌, కుమార్, మ‌హేష్‌, శంక‌ర‌య్య‌, రాజేంద్ర‌ప్ర‌సాద్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author