NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు,మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని రోళ్లపాడు గ్రామానికి చెందిన మాల కుమ్మరి ప్రవీణ్ కుమార్(35) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఈనెల 12వ తేదీన 108 అంబులెన్స్ లో తీసుకువెళ్లి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆయన మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పేరెడ్డి వెంకటరామిరెడ్డి వారి ఇంటికి వెళ్లి మృతుని భార్య అయిన మాల కుమ్మరి ఎలీషమ్మకు వైయస్సార్ బీమా తక్షణ సహాయం కింద పదివేల రూపాయల నగదును బుధవారం సర్పంచ్ అందజేశారు.ఈయనకు యశ్వంత్(11),గౌతమ్(10) సంతానం ఉన్నారు.మిగతా 90 వేలు భీమా పరిహారం క్లేయిమ్ చేసినట్లు పంచాయితీ కార్యదర్శి వేల్పుల విజయ కుమారి తెలిపారు.ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ యాస్మిన్ మరియు తదితరులు ఉన్నారు. అదేవిధంగా దేవనూరు గ్రామానికి చెందిన ఈనెల 10వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించిన బోయ వెంకటకృష్ణ భార్యకు బీమా తక్షణ సహాయాన్ని గ్రామ సర్పంచ్ హరిత,ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,ఎంపీటీసీ ఫరీదాబి పదివేల రూపాయల నగదును అందజేశారు.పంచాయతీ కార్యదర్శి వీరారెడ్డి పాల్గొన్నారు.

About Author