NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభిమానం ఆత్మీయత అదరహో

1 min read

సి కే దిన్నే మండలంలో సాయినాథ్ శర్మ కు ఆత్మీయ ఘన స్వాగతం

పూలవర్షం కురిపించిన గ్రామస్థులు 

పల్లెవెలుగు వెబ్ కమలాపురం:  నియోజకవర్గ ప్రజానాయకుడు నిరుపేదప్రజా సేవకుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మకు చింతకొమ్మదిన్నె మండలం రాజుల తాతయ్యగారి పల్లె లో గ్రామస్థుల అపూర్వ ఆత్మీయ స్వాగతం పలికారు. గ్రామంలో నాగార్జున యాదవ్ ఆధ్వర్యంలో ప్రజలు సాయినాథ్ శర్మ గ్రామంలోకి రాగానే బాజా భజంత్రీలు మోగిస్తూ బాణాసంచ పేల్చుతూ పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానం చాటుకున్నారు. గ్రామంలో వర్షం రావడం కోసమై గ్రామస్థులు సంజీవరాయస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సాయినాథ్ శర్మ ను ఆత్మీయ పూర్వకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని సాయినాథ్ శర్మ కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం సాయినాథ్ శర్మ మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంతటి మంచి కార్యక్రమానికి గ్రామస్థులు తనని పిలవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. గ్రామంలో నాగార్జున యాదవ్, సురేంద్ర కట్ల సుబ్రమణ్యం రామచంద్ర రవి రాజశేఖర్ రెడ్డి అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author