PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌ష్యాకి వ్య‌తిరేకంగా.. ఉక్రెయిన్ సైన్యంలో చేరిన భార‌తీయుడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైద్యవిద్య అభ్యసించేందుకు ఉక్రెయిన్ దేశానికి వెళ్లిన తమిళనాడు విద్యార్థి .. ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్ధం నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రష్యాకు వ్యతిరేకంగా పోరాడేందుకు తమిళనాడు విద్యార్థి ఉక్రెయిన్‌లోని పారామిలటరీ దళంలో చేరాడు. 2018వ సంవత్సరంలో ఉక్రెయిన్ దేశంలోని ఖార్కివ్‌ నగరంలోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్శిటీలో చదువుకోవడానికి సాయినికేష్ ఉక్రెయిన్ వెళ్లారు. సాయినికేష్ వైద్యవిద్య 2022 జులై నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఈ లోగా ఉక్రెయిన్ దేశంపై రష్యా దండయాత్ర చేస్తుండటంతో సాయినికేష్ ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు.

                                        

About Author