PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అగ్నిప‌థ్ ఆందోళ‌న‌లు.. న‌ష్టం విలువ రూ. 35 కోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అగ్నిపథ్ స్కీమ్ వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు సృష్టించిన విధ్వంసం పై రైల్వే అధికారులు అంచ‌నా వేశారు. ఈ విధ్వంసం వల్ల సుమారు రూ.35 కోట్లకుపైగా ఆస్తులకు నష్టం వాటిల్లినట్లు రైల్వే అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటే నష్టం మరో రూ.నాలుగైదు కోట్లకు పెరగవచ్చని భావిస్తున్నారు. విధ్వంసంలో ఎనిమిది రైలింజన్లు దెబ్బతిన్నాయి. నాలుగు రైలుబోగీలు పూర్తిగా దహనమయ్యాయి. మరో 30 ఏసీ బోగీలు, 47 నాన్‌ఎసీ బోగీలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీంతో పాటు ఎస్కలేటర్లు, ఫ్యాన్‌లు, ఫ్లాట్‌ఫారాలపై ఉన్న దుకాణాలు, టీవీ స్ర్కీన్‌లు, డిజిటల్‌ బోర్డులు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. స్టేషన్‌లోని పార్సిల్‌ ఆఫీసు కేంద్రంపైనా నిరసనకారులు దాడులు చేయడంతో ఆయా ప్రాంతాలకు చేరవేయాల్సిన పార్సిళ్లు పూర్తిగా ధ్వంసం కావడం, కాలిపోవడం వంటివి జరిగాయని వెల్లడించారు. రూ.కోట్ల విలువైన పార్సిల్‌ చేయాల్సిన వస్తుసామగ్రి ఆందోళనకారుల ధ్వంసమైందని చెప్పారు.

                                           

About Author