PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముందుంది … మ‌హా ముప్పు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: అమెరికా మరోసారి ఆర్థిక మాంద్యా న్ని చవిచూడనుందా? అది 2008 ఆర్థిక సంక్షోభం కంటే తీవ్రంగా ఉంటుందా? అవుననే అంటున్నారు ప్రముఖ ఆర్థికవేత్త, రోబిని మాక్రో అసోసియేట్స్‌ చైర్మన్‌, సీఈఓ నోరియల్‌ రోబిని. ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు. అమెరికాతో సహా అనేక దేశాలను 2008లో కుదిపేసిన ఆర్థిక సంక్షోభాన్నీ రోబిని ముందే చెప్పారు. అమెరికాలో ఈ ఏడాది చివరికల్లా ప్రారంభమయ్యే ఈ ఆర్థిక ఉత్పాతం వచ్చే ఏడాదంతా ప్రపంచ దేశాలను తీవ్రంగా కుదిపేస్తుందని రోబిని హెచ్చరించారు. ప్రస్తుత ఆర్థిక సంక్షోభ సమయంలో రోబిని చేసిన ఈ హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

                                           

About Author