PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఎయిడ్స్​’ బాధితులకు..అల్పాహారం…

1 min read

శ్రీ సాయి ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో అల్పాహారం.. పౌష్టిక ఆహారం కిట్ల పంపిణీ

  •  నిర్వాహకులు రాజా విష్ణువర్ధన్​ రెడ్డి, నాగరాజు యాదవ్​ను మెచ్చుకున్న కలెక్టర్​
  • నాగరాజు యాదవ్​ను సన్మానంచిన అధికార యంత్రాంగం

కర్నూలు, పల్లెవెలుగు:  ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యమని… వ్యాధిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు కలెక్టర్​  డా.జి.సృజన.  శుక్రవారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  హెచ్ ఐ వి బాధితులతో జిల్లా కలెక్టర్ డా.జి.సృజన  అల్పహార విందు లో పాల్గొన్నారు.  వారితో కలిసి కలెక్టర్  సహ పంక్తిలో అల్పాహారం తీసుకోవడం విశేషం… ఈ కార్యక్రమం లో పాల్గొని ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్ష వద్దు అనే సందేశాన్ని సమాజానికి అందించారు. కాగా శ్రీ సాయి ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో ఎయిడ్స్​ బాధితులకు అల్పాహార విందు, పౌష్టిక ఆహార కిట్లను పంపిణీ చేశారు.  అనంతరం  శ్రీ సాయి ఆదరణ సేవా సమితి నిర్వాహకులు రాజా విష్ణువర్ధన్​ రెడ్డి, నాగరాజు యాదవ్​ ను  అధికార యంత్రాంగం అభినందించారు. ఆ తరువాత నాగరాజు యాదవ్​ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

About Author