PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైమానిక దాడులు.. 11 మంది మృతి

1 min read

పల్లెవెలుగువెబ్ : సౌదీ అరేబియా సంకీర్ణ దళాలు .. హుతీ తిరుగుబాటుదారుల ఆధీనంలోని యెమెన్ రాజధాని సనా పై వైమానికి దాడులు జరిపారు. ఈ ఘటనలో 11 మంది మృతి చెందినట్టు సమాచారం. దీంతో పాటు సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన ఎనిమిది డ్రోన్లను కూడ అడ్డుకున్నట్టు దళాలు వెల్లడించాయి. సోమవారం యూఏఈ రాజధాని అబుదాబి పై యెమెన్ తిరుగుబాటుదారులు జరిపిన దాడుల్లో ఇద్దరు భారతీయులతో సహా ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా సౌదీ అరేబియా సంకీర్ణ దళాలు దాడులు జరిపాయి. వైమానిక దాడుల కారణంగా రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయని, 11 మంది మృతి చెందినట్టు స్థానికులు చెప్పినట్టు ఓ వార్తసంస్థ వెల్లడించింది.

        

About Author