PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విమాన టికెట్లు ఈఎమ్ఐ రూపంలో చెల్లించ‌వచ్చు !

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రముఖ విమాన‌యాన సంస్థ స్పైస్‌జెట్‌ వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఎయిర్‌లైన్స్‌ టికెట్ల కొనుగోలుకు ప్రయాణికులు 3, 6 లేదా 12 నెలల పాటు సమాన వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లింపులు జరిపేందుకు అవకాశం కల్పిస్తోంది. అది కూడా వడ్డీ లేకుండా చెల్లించ‌వచ్చు. ఈ పథకాన్ని ఎంచుకునే ప్రయాణికులు పాన్‌, ఆధార్‌ నంబరును సమర్పించడంతోపాటు వన్‌ టైం పాస్‌వర్డ్‌ ద్వారా వివరాల్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. అలాగే, కస్టమర్లు తొలి ఈఎంఐని తమ యూపీఐ ఐడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెలల్లో చెల్లించాల్సిన ఈఐఎంలనూ అదే యూపీఐ ఐడీ నుంచి మినహాయించుకుంటుంది. ఈ త‌ర‌హా ప‌థ‌కం ప్రవేశ‌పెట్టడం ఇదే తొలిసారి.

About Author