NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మద్యం పట్టివేత.. కారు సీజ్​

1 min read
  • పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు పట్టణ  శివారులోని పంచలింగాల అంతరాష్ట్ర చెక్ పోస్ట్ నందు జిల్లా యస్ పి సుధీర్ కుమార్ రెడ్డి మరియు SEB addl SP తుహీన్ సీన్హా  ఆదేశాల మేరకు  గురువారము తెల్లవారు జామున సి ఐ మంజుల మరియు యస్ ఐ రాముడు మరియు సెబ్ సిబ్బంది వాహనాలను తనిఖీ చేశారు.  తనిఖీల్లో తెలంగాణ రాష్ట్రం అలంపూర్ వైపు నుండి ఫోర్డ్ ఫియేస్ట కారు (AP 28 DK 2491) తనిఖీ చేయగా అందులో కర్నూల్ పట్టణం ఒబుల్లయ్య నగర్ షరీన్ నగర్ కు చెందిన బండి సురేష్ బాబు (42)   తెలంగాణ రాష్ట్రం గద్వాల్ నుండి 7 బాక్సుల మద్యం కొనుగోలు చేసి కర్నూల్ కు తరలిస్తూ seb అధికారుల తనిఖీల్లో దొరికాడు. కారులో  7 కాటన్​ బాక్స్​ల్లో 108 అక్రమ తెలంగాణ ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కారు సీజ్​ చేశారు.   రెండు నెలల క్రితం ఇదే వ్యక్తి కారులో అక్రమ మద్యం తరలిస్తూ పంచ లింగాల చెక్ పోస్ట్ వద్ద దొరికాడు. పట్టుకొన్న మద్యం బాటిళ్లును,,కారును సీజ్ చేసి  కర్నూల్ SEB పోలీసు స్టేషన్ కు తదుపరి విచారణ నిమిత్తం అప్పగించినట్లు సి ఐ మంజుల తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుళ్లు ఖాజా,జగన్నాథం,spo రంగ స్వామి లు పాల్గొన్నారు.

About Author