PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మలబార్ గోల్డ్ & డైమండ్స్ కొత్త అంబాసిడర్ గా అలియా భట్

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ : అనిల్ కపూర్, కరీనా కపూర్ ఖాన్ మరియు కార్తీ వంటి ప్రముఖ సినీ నటులను తమ బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంచుకున్న మలబార్ గోల్డ్ & డైమండ్స్ జాబితాలో తాజాగా ప్రముఖ సినీతార అలియా భట్ కూడా చేరారు.అలియా భట్ తో చిత్రీకరించిన ఫ్లాగ్లిప్ బ్రైడల్ క్యాంపెయిన్ – బ్రెడ్స్ ఆఫ్ ఇండియా-2023లో ప్రదర్శించబడుతుంది.ప్రపంచ వ్యాప్తంగా 10 దేశాలలో 312 షోరూములతో, 6వ అతి పెద్ద ఆభరణాల రిటైల్ వ్యాపార సంస్థగా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ & డైమండ్స్, భారత దేశంలో ప్రముఖ సినీతారగా కీర్తించబడుతున్న అలియా భట్ను తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంటూ ఒప్పందంపై సంతకం చేసింది. 2012లో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన అలియా భట్, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో భారతదేశంలో అత్యంత ఆదరణ కలిగిన నటీమణులలో ఒకరిగా నిలిచారు. నటిగా బహుముఖ ప్రజ్ఞతో, వినయపూర్వకమైన వ్యక్తిత్వంతో మరియు అద్భుతమైన సౌందర్యంతో, భారతదేశంలో సూపర్ టాలెంటెడ్ నటుల కొత్త శకానికి ప్రతినిధిగా ఆమె ప్రశంసలు అందుకున్నారు. హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కూడా అడుగుపెట్టిన అలియా భట్ నటించిన హార్ట్ ఆఫ్ స్టోన్ అనే సినిమా త్వరలో విడుదల కాబోతున్నది. “మలబార్ గోల్డ్ & డైమండ్స్ లాంటి గ్లోబల్ బ్రాండికి నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైనందుకు చాలా ఆనందంగా ఉంది. భారతీయులు మరియు భారత ఉపఖండ ప్రజల్లో మలబార్ సంస్థకున్న ఆదరణ ప్రత్యక్షంగా చూసిన తరువాత, అలాగే విదేశాలలో సైతం వారు సాధించిన అపారమైన విజయాలు చూసిన తరువాత మనందరికీ గర్వకారణంగా అనిపిస్తుంది, అలాగే మలబార్ కుటుంబంలో భాగమైనందుకు నేను వినయపూర్వకంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎంతో ప్రతిష్టాత్మకంగా విస్తరణ ప్రణాళికను అమలు చేయడానికి మలబార్ గోల్డ్ & డైమండ్స్ సిద్ధమవుతున్నందున, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆభరణాల ప్రేమికులకు మరింత చేరువకావడానికి వారితో సన్నిహితంగా పని చేయడానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని అలియా భట్ వ్యాఖ్యానించారు.

About Author