NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్య‌మంత్రులంతా ముంబైలో స‌మావేశం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : దేశ రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇందుకు ముంబై వేదిక కానుంది. బీజేపీయేత‌ర ముఖ్యమంత్రుల సమావేశం ముంబైలో జరుగుతుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం తెలిపారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతోపాటు ద్రవ్యోల్బణం, మత విద్వేషాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. ​కాగా, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశానికి సంబంధించి బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసినట్టు తెలిపారు. మమతా బెనర్జీ లేఖపై సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవారు చర్చించారని ఆయన వెల్లడించారు.

                                 

About Author