NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మోహ‌న్ లాల్ కు ఈడీ నోటీసులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : మలయాళ సూపర్‌ స్టార్ మోహన్‌ లాల్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు మోహన్‌ లాల్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మోహన్ లాల్‌కు నోటీసులు పంపింది. వచ్చే వారం కొచ్చి ఈడీ కార్యాలయంలో మోహన్‌లాల్‌ను అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం. పురాతన వస్తువుల వ్యాపారి మాన్సన్‌ మాన్కల్‌తో కలిసి మోహన్ లాల్‌ మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయని అధికారులు తెలిపారు. అయితే ప్రజలను రూ. 10 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై మాన్సన్‌ను గత సెప్టెంబర్‌లోనే కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళలో ఉన్న మాన్సన్‌ ఇంటికి మోహన్‌ లాల్‌ ఒకసారి వెళ్లినట్లు సమాచారం. అయితే అలా మోహన్‌ లాల్‌ వెళ్లడానికి కారణాలు తెలియరాలేదు.

                                                          

About Author