PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేశ‌మంతా.. ఒకే కులం, ఒకే మతం అనుస‌రిస్తే .. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాలానికి అనుగుణంగా మతాన్ని నారాయణ గురు సంస్కరించారని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చెప్పారు. శివగిరి యాత్ర 90వ వార్షికోత్సవాలు, బ్రహ్మ విద్యాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా ఏడాదిపాటు జరిగే వేడుకల ప్రారంభం సందర్భంగా మంగళవారం ఆయన న్యూఢిల్లీలో మాట్లాడారు. కేరళకు చెందిన శ్రీ నారాయణ గురు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త కూడా. ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడారు. వేడుకల ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ, శ్రీ నారాయణ గురు బోధనలను, ‘ఒకే కులం, ఒకే మతం, ఒకే దైవం’ సందేశాన్ని ప్రజలు అనుసరిస్తే, మన దేశాన్ని ప్రపంచంలోని ఏ శక్తీ విభజించజాలవని తెలిపారు. ఆయన సందేశం ‘ఆత్మ నిర్భర్ భారత్’కు మార్గదర్శనం చేస్తుందన్నారు.

                                     

About Author