PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జొహరాపురం ఇందిరమ్మ కాలనీలో సమస్యలన్నీ పరిష్కరిస్తా..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జొహరాపురం ఇందిరమ్మ కాలనీలో ఉన్న సమస్యలన్నీ తాను తప్పక పరిష్కరిస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టి.జి భరత్ అన్నారు ఇందిరమ్మ కాలనీలో ఆయన టి.జి భరత్ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లి పెద్దలు, మహిళలు, యువత, వృద్ధులను కలిసి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ కాలనీలో ఉన్న రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్య, కుళాయిలు, పారిశుద్ధ్యo, ఇళ్ల సమస్యలన్నీ తాను గెలిచిన వెంటనే కచ్చితంగా తీరుస్తానని హామీ ఇచ్చారు. తనపై నమ్మకం పెట్టుకోవాలని ఆయన ప్రజలను కోరారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా తాను కృషి చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపిని గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు బాబ్జి, మోహన్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు ముంతాజ్, గున్నామార్క్, భాస్కర్, విజయరాణి, శాంతమ్మ, చిట్టెమ్మ, రమేష్, నాగరాజు, మాధవస్వామి, తిరుపతయ్య, విజయలక్ష్మి, కౌలుట్లయ్య, భాస్కర్, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

About Author