NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం… టి.జి భరత్

1 min read

న్యాయవాదులు, అంగన్వాడీ కార్యకర్తల నిరసనలకు మద్దతు తెలిపిన టి.జి భరత్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అందరి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని కర్నూలు నియోజకవర్గ టిడిపి ఇంఛార్జీ టి.జి భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ లో న్యాయవాదులు, అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసనలకు టి.జి భరత్ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోకూడదన్నారు. ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకొని అమలు చేసే ముందు ఆలోచించాలన్నారు. ప్రభుత్వంలో ఎంతో మంది సలహాదారులు ఉన్నప్పటికీ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో తెలియడం లేదన్నారు. కోర్టులో వాదించాల్సిన న్యాయ‌వాదులు రోడ్డు మీద‌కొచ్చి నిర‌స‌న తెలిపే ప‌రిస్థితి వ‌చ్చిందన్నారు. హైకోర్టు కర్నూలుకు రాలేదని.. హైకోర్టు ఇస్యూను డైవర్ట్ చేయడానికే కొత్త సమస్యలు తీసుకొస్తున్నట్లుందన్నారు. చంద్రబాబు నాయుడు హైకోర్టు బెంచ్ కర్నూలుకు తెస్తామని అప్పట్లోనే చెప్పారని, మా ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోపే కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకొస్తామన్నారు. న్యాయవాదులు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో విజన్ ఉన్న చంద్రబాబుని గెలిపించుకుంటేనే అందరికీ భవిష్యత్తు ఉంటుందన్నారు. అంగన్వాడీ కార్యకర్తల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. స‌రైన ప్ర‌భుత్వాన్ని ఎన్నుకోక‌పోతే ఇలాంటి ప‌రిస్థితే ఉంటుందన్నారు.

About Author