PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ డ‌బ్బంతా మంత్రి గారిదే !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగ నియామకాల స్కామ్‌ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈడీ విచారణలో నటి అర్పితా ముఖర్జీ.. పార్థా ఛటర్జీ గురించి కీలక విషయాలు తెలిపారు. అయితే, విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ.. తనకు 2016 నుంచి పరిచయం ఉన్నట్టు అర్పిత తెలిపారు. ఓ బెంగాలీ న‌టుడు త‌న‌ను మంత్రికి చేశారని చెప్పుకొచ్చారు. తన ఇంట్లో దొరికిన రూ. 21కోట్ల డబ్బు పార్థా ఛటర్జీదేనని తెలిపారు. ఈ క్రమంలోనే పార్ధా త‌న ఇంట్లో ఉన్న ఓ రూమ్‌లోనే డ‌బ్బును దాచాడ‌ని పేర్కొంది. త‌న ఇంటితో పాటు మ‌రో మ‌హిళ ఇంటిని కూడా ఆయన మినీ బ్యాంక్‌లా వాడుకున్న‌ట్లు ఆరోపించారు. తన ఇంట్లోని రూమ్‌కు ఫుల్‌ సెక్యూర్టీగా పార్థా మనుషులే ఉండేవారని చెప్పింది. వారు మాత్రమే రూమ్‌ లోపలి వెళ్లి వచ్చేవారని స్పష్టం చేసింది.

                                       

About Author