PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాణ్యం లో అన్ని రైళ్లు ఆపాలి… ప్రజా సంఘాలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం:  నంద్యాల లోని రైల్వే స్టేషన్ ఆధునికరణ పనులు వెంటనే పూర్తి చేయాలని కర్నూలు నంద్యాల రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని కర్నూలు విజయవాడ  ఎక్స్ప్రెస్ రైలు నడపాలని శుక్రవారం నాడు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పాణ్యం రైల్వే స్టేషన్ లో రైల్వే జీ ఎం A K జైన్ కి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి. రామచంద్రుడు సిఐటియు జిల్లా కార్యదర్శి వి. బాల వెంకట్ సిఐటియు మండల కార్యదర్శి కే. భాస్కర్ ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రతాప్ నాయకులు సతీష్, రాజాల తో కలిసి వారు మాట్లాడుతూ నంద్యాల రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు వేగవంతం చేయాలని , డబ్లింగ్ పనులు త్వరగా పూర్తి చేసి నంద్యాల -విజయవాడ ప్రయాణ సమయాన్ని తగ్గించాలని, నంద్యాల మీదుగా ప్యాసింజర్ రైళ్లు విజయవాడ- గుంతకల్  మధ్యల నడపాలని  అలాగే పాణ్యం లో అన్ని రైళ్లు ఆగేలాగా చర్యలు తీసుకోవాలని వారు అన్నారు ఈ సమస్యలు పరిష్కారం కాకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని వారు తెలిపారు.

About Author