PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భాయ్‌తో మైత్రి

1 min read

సినిమా డెస్క్​: తెలుగు ఇండస్ట్రీలో టాప్‌ లిస్ట్‌లో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ నుంచి తాజా న్యూస్‌ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఎంతోమంది హీరోయిన్లను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన మైత్రీ మూవీస్‌ ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్‌‌ హీరోతో సినిమా నిర్మించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. భాయ్‌ సల్మాన్‌ ఖాన్‌తో సంప్రదింపులు జరిపారని, అందుకు ఆయన ఒప్పుకున్నారని బలంగా టాక్‌ వినిపిస్తోంది. అధికారిక వివరాలేవీ వెలువడలేదు, కానీ స్క్రిప్ట్‌ వర్క్ పనులు కూడా ప్రారంభమయ్యాయని, డైరెక్టర్, మిగిలిన పనులు సెట్‌ కాగానే సినిమా పట్టాలెక్కించేస్తారని అంటోంది టీమ్.

About Author