PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రక్షణ గోడకు నిధులు కేటాయించండి..

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఎమ్మిగనూరులోని కురువ కమ్యూనిటీ హల్ వద్ద ప్రమాదకర వంతెన ఉందని , రక్షణ గోడ నిర్మాణానికి ఎంపీ నిధులు కింద ప్రత్యేక నిధులు కేటాయించాలని   జిల్లా కురువ సంఘం కోశాధికారి కే .సి .నాగన్న,  నగరసంఘం  మాజీ కార్యదర్శి బి .రామకృష్ణ, ఎమ్మిగనూరు మండలం కురువ సంఘం నాయకులు కే .హంపయ్య ,కే .టి .ఉరుకుందు  కే .వెంకటరాముడు , గోనెగండ్ల మండల కురువ సంఘం నాయకులూ పిలిగుండ్ల నాగన్న లు కోరారు. గురువారం కర్నూలులో ఎంపీ సంజీవ్ కుమార్ ను ఆయన నివాసంలో కలిసి ఆయా మండలం లోని సమస్యల ఫై వినతిపత్రం ఇచ్చారు . ఈ సందర్బంగా ఎం .పీ  సానుకూలంగా స్పందించించారు.

About Author