PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయండి

1 min read

-జిల్లా కలెక్టర్ ను కలిసిన వంగాల భరత్ కుమార్ రెడ్డి

 పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కలిశారు.మండల పరిధిలోని తలముడిపి గ్రామంలో 2021 వ సంవత్సరంలో ముఖ్యమంత్రి మానస పుత్రికలు నవరత్నాలు పథకంలో భాగంగా ‘పేదలందరికీ ఇల్లు’అనే పథకం ద్వారా అప్పట్లో అర్హులైన వారికి గ్రామంలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు.అక్కడ ఇళ్ల నిర్మాణాలు చేపట్టకూడదని అప్పట్లో కోర్టును ఇద్దరు వ్యక్తులు ఆశ్రయించారు.ఇండ్ల నిర్మాణా లు చేపట్టకూడదని  కోర్టు స్టే విధించినందున ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. కోర్టు స్టే విధించినందున గ్రామంలో వేరే భూమిని తీసుకొని పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వమని ముఖ్యమంత్రి ఆదేశించారని మా గ్రామంలో ఇండ్లు లేక ఎంతో మంది నిరుపేదలు అవస్థలు పడుతున్నారని వారందరికీ త్వరితగతిన ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ భరత్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. స్థలాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు.

About Author