PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కనకదాసు విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించండి : కురువ సంఘం

1 min read

పల్లెవెలుగు వెబ్​: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని ఆదివారం కురువ సంఘం నాయకులు కలిశారు. ఈ సందర్బంగా కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంకే రంగస్వామి, స్థానిక కురువ సంఘం నాయకులు హంపయ్య, మద్దిలేటి, యంకప్ప మాట్లాడుతూ ఎమ్మిగనూరులోని బీరలింగేశ్వర స్వామి కమ్యూనిటీ హల్ కు ప్రహరి నిర్మాణానికి, వంక వద్ద బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని, అలాగే కనకదాసు జయంతిని వైయస్సార్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, ఎమ్మిగనూరులో కనకదాసు విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీ నిధుల ద్వారా ప్రహరి, బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, స్వయంగా ఎంపీకి ఫోన్ చేస్తానని హామీ ఇచ్చారు. కనకదాసు విగ్రహ స్థలం కోసం మున్సిపల్ కమిషనర్ కలవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కేటీ ఉరుకుందు, జిల్లా నాయకులు కే .ఎల్లయ్య, కే .లక్ష్మన్న పాల్గొన్నారు.

About Author