NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ సైనికులకు జగనన్న కాలనీ కింద ఇల్లు కేటాయించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మన కర్నూలు జిల్లా మాజీ సైనికుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తో నాగలాపురం దగ్గర కలవడం జరిగింది మాజీ సైనికుల సమస్యలు కార్పొరేషన్ గురించి మరియు చాలామంది మాజీ సైనికులు బీదవారున్నారు అటువంటి వారికి జగనన్న కాలనీ కింద ఇల్లు కట్టించవలసినదిగా కోరడం జరిగింది అదేవిధంగా ఓర్వకల్లులో ఎవరికైతే పొలం ఉన్న వారికి నోటీసులు ఇచ్చారు. వారికి న్యాయం చేయవలసిందిగా కోరడం జరిగింది అదేవిధంగా గత మూడు సంవత్సరాల నుంచి జిల్లా సైనిక్ బోర్డు నుంచి కలెక్టర్ ఆఫీస్ కు పొలం కోసము ఒక అప్లికేషన్ గాను తీసుకోవడం లేదు అది తీసుకునే విధంగా చేయాలని మాజీ సైనికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసినదిగా మాజీ సైనికులకు అన్ని విధాలుగా న్యాయం చేయవలసిందిగా ముఖ్యమంత్రిని కోరడం జరిగింది ఇందులో పాల్గొన్నవారు. శ్రీ గడ్డం రామకృష్ణ  మనోహర్ రాజుగారు గడ్డం శీను  ట్రెజరర్ నజీర్ అహ్మద్  మరియు మేమందరము ముఖ్యమంత్రి తో కలిసి మాజీ సైనికుల సమస్యల గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా లెటర్ ఇవ్వడం జరిగింది వారు సానుకూలంగా స్పందించినారు ఇట్లు కర్నూలు జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు నర్రా పేరయ్య చౌదరి.

About Author