NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిజివి సంస్థల ఆధ్వర్యంలో శివస్వాములకు భిక్ష

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: టిజివి సంస్థల సహకారంతో కర్నూలు నగరంలో శివస్వాములకు భిక్ష ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ అన్నారు. మంగళవారం నగరంలోని కొత్త అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న కైలాసగిరి దేవాలయంలో శివస్వాములు, శ్రీశైలం పాదయాత్రీకులకు టీజీవీ సంస్థల ఆధ్వర్యంలో బిక్షను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా టిజి భరత్ ప్రత్యేక పూజలు చేసి అనంతరం స్వాములకు బిక్ష వడ్డించారు. అనంతరం టిజి భరత్ మాట్లాడుతూ శివస్వాములకు బిక్ష ఏర్పాటుచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. శివస్వాములు దీక్షలో ఎంతో నిష్టతో ఉంటారని, దీక్ష పూర్తైన తర్వాత కూడా మంచి అలవాట్లను కొనసాగించుకోవాలన్నారు. కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు మళ్లీ రాకూడదని దేవుడిని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక శివస్వాముల బిక్ష కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నిర్వాహకులను అభినందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు, తదితరులు పాల్గొన్నారు.

About Author