PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, గోనెగండ్ల : మండల కేంద్రం మైన గోనెగండ్ల జిల్లా  పరిషత్ ఉన్నత పాఠశాలలో 1981 నుండి 1987 సంవత్సరాల్లో చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం  సమిష్టిగా కలసి ఘనంగా  నిర్వహించారు .గోనెగండ్ల లోని స్టేట్ బ్యాంక్ నుండి జిల్లా పరిషత్ హై స్కూల్ వరకు రథం వాహనం పై తమ గురువు తాతారావు ను ఘనంగా ఊరేగించారు . అనంతరం  వేదికపై ఒక్కొక్క బ్యాచ్ విద్యార్థులు ఆత్మీయ గురువు తో పరిచయాలు ,గత తీపి మధుర సన్నివేశాలను గుర్తు చేసుకున్నారు . ఆత్మీయ సన్మాన సభ లో గురువు తాతరావుకు  ఘనంగా శాలువా పూల మాలతో సన్మానించారు. అనంతరం పూర్వవిద్యార్థి అయిన డాక్టర్ ఆండ్రుష్ తమ గురువును ఒక తులం బంగారు గొలుసు సన్మానించారు. మరికొందరు బంగారు ఉంగరాలతో సన్మానించారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఎస్ ఎన్ మాబువలి, డాక్టర్ అండ్రుస్, నాగరాజు నాయుడు,యస్ ఎన్  మాబువలి, ఎంపి బడేసాహెబ్,ఇసాక్ సాహెబ్,  లు మాట్లాడుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో దాదాపు 6 సంవత్సరాలు  ఉపాధ్యాయుడుగా ఆర్  తాతా రావు పనిచేశారు.పూర్వ విద్యార్థులు 1980 నుంచి 1986వరకు చదివిన పూర్వ విద్యార్థులు కలసి ఆర్ తాతారావు గారికి ఘనంగా సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author