NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు నియోజకవర్గం ఒ బి సి సెల్ చైర్మన్ గా ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్ గా  హోళగుంద కు చెందిన చాకలి.మంగయ్య ఎన్నికవ్వడం జరిగిందని, ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డి.ఎస్.బాషా  తెలిపారు. పార్టీకి మంగయ్య చేసిన సేవలను గుర్తించి, డిసిసి చైర్మన్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో మంగయ్య ను ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు. తన సేవలను గుర్తించి, పదవి ఇవ్వడం హర్షనీయమని, తనకు పదవి ఇచ్చిన డిసిసి చైర్మన్ సుధాకర్ బాబు మరియు ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డి.ఎస్. భాష లకు ఈ సందర్భంగా మంగయ్య ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ చైర్మన్ సుధాకర్ బాబు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author