NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ రాజధాని అమరావతే !

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ రాజధాని అమరావతిపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా ఏపీలోని కర్నూలు జిల్లా పరిధిలో సాగుతున్న నేపథ్యంలో… రాహుల్ ను అమరావతి రైతులు కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ…అమరావతే ఏపీకి ఏకైక రాజధాని అని అన్నారు. ఏపీ రాజధానిపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇదేనని కూడా రాహుల్ గాంధీ అన్నారు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమానికి న్యాయపరమైన సాయం అందిస్తామని ఆయన తెలిపారు.

     

About Author