PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంబానీ, అదానీలను పూజించాలి !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ విధానాలు ఆదాయ అసమానతలను పెంచుతున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు కేజే ఆల్ఫోన్స్ స్పందించారు. ఉద్యోగాలను సృష్టిస్తున్న అంబానీ, ఆదానీ వంటి పారిశ్రామికవేత్తలను పూజించాలన్నారు. వారిని గౌరవించాలని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడిదారుల బాకానని తనను ప్రతిపక్షాలు నిందించవచ్చునని అంటూ, ఈ దేశంలో ఉద్యోగాలను సృష్టించేవారిని మనం గౌరవించాలన్నారు. వారి పేర్లను ప్రతిపక్షాలు చెప్తున్నాయి కాబట్టి నేను కూడా చెబుతానన్నారు. రిలయన్స్, అంబానీ, అదానీ, వేరొకరు ఎవరైనా సరే, వారిని మనం పూజించాలి, ఎందుకంటే, వారు ఉద్యోగాలు ఇస్తున్నారన్నారు. పెట్టుబడి పెట్టేవారు ఉద్యోగాలను సృష్టిస్తున్నారన్నారు.

           

About Author